
ప్రజల రుణం తీర్చుకుంటా
ధర్మపురి/ధర్మారం: రాజకీయంలో ఓడినా.. గెలిచినా ప్రజల మధ్యనే ఉన్నానని, చివరకు వారే తనకు పట్టం కట్టారని, ఇప్పుడు వారి రుణం తీర్చుకుంటానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మంత్రి పదవి వచ్చిన అనంతరం మొదటిసారి ధర్మపురి పుణ్యక్షేత్రానికి చేరుకున్న ఆయనకు వివిధ మండలాల నుంచి వేలాది మంది కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శ్రీలక్ష్మినరసింహ స్వామి ఏసీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు కల్పించిన అవకాశం.. నృసింహుడి కృపతో ఇంత వాడినయ్యానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నియోజకవర్గంలోని రైతాంగానికి చుక్కనీరు కూడా అందించలేదని, ఇప్పుడా సమస్య తీరుతుందని తెలిపారు. ముందుగా మంత్రికి నృసింహస్వామి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి శేష వస్త్రం ప్రసాదాలు అందించారు. మాజీమంత్రి జీవన్రెడ్డి, ఈవో శ్రీనివాస్, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, కటారి చంద్రశేఖర్రావు, శాభారాణి తదితరులున్నారు.
కాంగ్రెస్ నాయకుల ఘన స్వాగతం
ధర్మారం మండల ప్రజలు జెడ్పీటీసీగా తనకు రాజకీయ జన్మనిస్తే.. ధర్మపురి ఎమ్మెల్యేగా ఎన్నికై న తనను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి మంత్రివర్గంలో స్థానం కల్పించిందని మంత్రి అడ్లూరి అన్నారు. ధర్మారం మండలం పత్తిపాక క్రాస్రోడ్డు వద్ద కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఆయనకు ఘన స్వా గతం పలికారు. కటికెనపల్లి వద్ద గజమాలతో లక్ష్మణ్కుమార్తోపాటు మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీని వాస్రావును సన్మానించారు. నియోజకవర్గ ప్రజల కు అందుబాటులో ఉంటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాస్ రావు, నాయకులు చంద్రశేఖర్రావు, కొడారి అంజన్న, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, కొత్త నర్సింహం, కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్, ఓరం చిరంజీవి, వీరేశం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజకీయ జన్మనిచ్చిన ధర్మారం
సన్మాన సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
పత్తిపాక క్రాస్రోడ్డు వద్ద
పార్టీ శ్రేణుల ఘన స్వాగతం