
ఆర్టీజన్లను కన్వర్షన్ చేయకుంటే ఉద్యమం
పెద్దపల్లిరూరల్: విద్యుత్ ఆర్టీజన్లను తక్షణమే కన్వర్షన్ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదని టీవీఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు, కన్వీనర్ వజీర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో సోమవారం జిల్లా జేఏసీ కో చైర్మన్ దుర్గం విశ్వనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఆర్టిజన్ కార్మికుల సన్నాహక సమావేవంలో వారు మాట్లాడారు. ఈనెల 18న టీవీఏసీ జేఏసీ సమ్మె నోటీసు అందించి హైదరాబాద్లో బహిరంగసభ నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలోని 20 వేల మంది ఆర్టిజన్లు భార్యాపిల్లలు సభకు హాజరు కావాలని వారు కోరారు. జేఏసీ ఉద్యమంపై కుట్రలు చేస్తున్న కొందరు యూనియన్ నాయకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. కన్వర్షన్ అమలు చేసిన తర్వాతే జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజినీర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వినియోగదారుల సంఖ్య లక్షల్లో పెరిగిందని తెలిపారు. డీటీఆర్, పీటీఆర్ సంఖ్య వేల్లలో పెరిగాయని, ట్రాన్స్కో, డిస్కంలో వేల కిలోమీటర్ల దూరం లైన్స్ పెరిగాయని, ఉద్యోగుల సంఖ్య పెరగలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి 20 వేల ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేందర్, రఘునాథ్రెడ్డి, రవీందర్రెడ్డి, సీఐటీయూ నాయకుడు నాయక్, జిల్లా జేఏసీ కన్వీనర్ మట్ట రాజు, నాయకులు ఎస్.రవి, సందీప్, ప్రభాకర్, రవి, స్వప్న, కిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
18న భార్యాపిల్లలతో బహిరంగ సభ
టీవీఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు