మిత్రుడిని గల్ఫ్‌ పంపించి.. తిరిగి వస్తుండగా అనంతలోకాలకు | - | Sakshi
Sakshi News home page

మిత్రుడిని సాగనంపి వస్తుండగా అదుపుతప్పిన కారు.. యువకుడు మృతి!

Jan 10 2024 1:18 AM | Updated on Jan 10 2024 1:02 PM

- - Sakshi

జగిత్యాలక్రైం: మిత్రుడిని గల్ఫ్‌ పంపించి తిరిగి వస్తుండగా.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి సమీపంలో కరీంనగర్‌–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపురకు చెందిన అస్లం (26) అక్కడికక్కడే మృతిచెందాడు.

ఇస్లాంపురకు చెందిన నలుగురు వ్యక్తులు సోమవారం రాత్రి ఓ మిత్రుడిని గల్ఫ్‌ పంపించేందుకు శంషాబాద్‌ ఏయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిరగి వస్తుండగా బెజ్జంకి వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో బోల్తాపడింది.

ఘటనలో కారు ముందుభాగంలో కూర్చున్న అస్లాం అక్కడికక్కడే మృతిచెందాడు. సోహెల్‌, యాకూబ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అస్లం రెండేళ్ల క్రితం వివాహమైంది. 15రోజుల క్రితమే కుమారుడు జన్మించాడు. జగిత్యాల కొత్తబస్టాండ్‌ టేలాలో పాన్‌టేలా నిర్వహిస్తున్నాడు. అస్లాం మృతిచెందడంతో ఇస్లాంపురలో విషాదం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement