గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక్కసారిగా.. | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక్కసారిగా..

Dec 7 2023 12:06 AM | Updated on Dec 7 2023 11:46 AM

- - Sakshi

సాక్షి, కరీంనగర్‌: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. కరీంనగర్‌ రూరల్‌ పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన కల్వల మారుతి(25) మేస్త్రీ పని చేస్తున్నాడు. గత సోమవారం రాత్రి మారుతి, అతని స్నేహితులు కల్యాణ్‌, రాకేశ్‌ బైక్‌లపై బొమ్మకల్‌ బైపాస్‌ నుంచి హైదరాబాద్‌ రోడ్డు వైపు వెళ్తున్నారు. మారుతి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి, పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

మారుతి కనిపించకపోవడంతో ముందు వెళ్తున్న కల్యాణ్‌, రాకేశ్‌ తిరిగి వచ్చారు. అతని మృతదేహాన్ని అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి తండ్రి పర్శరాములు, తల్లి పద్మ, సోదరి శరిష్మ ఉన్నారు. మంగళవారం కుమారుడి మృతదేహాన్ని చూసి పర్శరాములు స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. తన కుమారుడి మృతికి కారణమైన వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవి చ‌ద‌వండి: అత్త‌గారింటికొచ్చి, అనుమానాస్పదంగా చెరువులో శ‌వ‌మై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement