టెక్నికల్‌ కోర్సులతో ఉపాధి | - | Sakshi
Sakshi News home page

టెక్నికల్‌ కోర్సులతో ఉపాధి

Sep 28 2025 7:27 AM | Updated on Sep 28 2025 7:27 AM

టెక్న

టెక్నికల్‌ కోర్సులతో ఉపాధి

ఎల్లారెడ్డి: టెక్నికల్‌ కోర్సులతో ఉపాధి అవకాశాలు అనేకం ఉంటాయని ఎల్లారెడ్డి ఆర్డీ వో పార్థసింహారెడ్డి అన్నారు. పట్టణంలో ఏ ర్పాటు చేసిన అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ) భవనాన్ని ఆయన శనివారం ప్రా రంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ రజిత, కాంగ్రెస్‌ మండల, పట్టణ అధ్య క్షులు సాయిబాబా, వినోద్‌గౌడ్‌, నాయకులు వెంకట్రామ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

బిచ్కుందలో..

బిచ్కుంద(జుక్కల్‌)/తాడ్వాయి(ఎల్లారెడ్డి) : బిచ్కుంద, తాడ్వాయి మండలం బ్రహ్మాజివాడిలో ఏటీసీలు ప్రారంభమయ్యాయి. బి చ్కుందలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్ర మోద్‌కుమార్‌, బ్రహ్మాజీవాడిలో ఎంప్లాయీమెంట్‌ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెంటర్లలో అన్ని రకాల టె క్నాలజీ యంత్రాలు బిగించడం జరిగిందన్నారు. అడ్మిషన్లు పొందిన విద్యార్ధులకు త రగతులు ప్రారంభమయ్యాయన్నారు. టె క్నాలజీపై విద్యార్ధులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బ్రహ్మాజివాడిలో టీవో రమేశ్‌, ఏటీవో వెంకటరమణ, శ్రీమాన్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో

దోపిడీ తప్ప అభివృద్ధి లేదు

కామారెడ్డి టౌన్‌: బీఆర్‌ఎస్‌ హయాంలో రా ష్ట్రంలో దోపిడీ తప్ప అభివృద్ధి జరలేదని డీసీ సీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పా ర్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటే, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలో దోచుకున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఎన్నికల్లో టికె ట్‌ రాక మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నా రని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వమని మాట్లాడి తన పరువు, వారి పార్టీ పరువు తీసుకున్నారన్నారు. 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్‌ కార్డు కానీ, నియోజకవర్గానికి 10 ఇళ్లు ఇవ్వలేరన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లలో 65వేల ఉద్యోగా లు. పేదలకు సన్న బియ్యం, నియోజవర్గాని కి 3500 ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఎన్నో పథకాలు అమలు చే స్తోందని వివరించారు. మరో సారి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చ రించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రా జు, నాయకులు కారంగుల అశోక్‌రెడ్డి, ఐరేని సందీప్‌, గోనె శీను, గుడుగుల శీను, పంపరి లక్ష్మణ్‌, షేరు, అంజద్‌, లడ్డు, సత్యం, జమీ ల్‌, సర్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

టెక్నికల్‌ కోర్సులతో ఉపాధి
1
1/1

టెక్నికల్‌ కోర్సులతో ఉపాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement