ఆ ప్రోత్సాహం.. ఆమె ప్రగతికి దోహదం | - | Sakshi
Sakshi News home page

ఆ ప్రోత్సాహం.. ఆమె ప్రగతికి దోహదం

Jun 15 2025 8:17 AM | Updated on Jun 15 2025 8:17 AM

ఆ ప్రోత్సాహం.. ఆమె ప్రగతికి దోహదం

ఆ ప్రోత్సాహం.. ఆమె ప్రగతికి దోహదం

కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన ఎస్‌బీఐ చీఫ్‌ అసోసియేట్‌ యానాల సాయికృష్ణ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అచ్చియ్యమ్మల ఏకై క కుమార్తె యానాల శుభశ్రీవల్లి ఆత్రేయి. చిరునవ్వుల ఈ చిన్నారికి చదువంటే ప్రాణం. ఆమె ఆసక్తిని గమనించిన నాన్న తగిన విధంగా ప్రోత్సహించారు. ఆత్రేయికి చిన్నతనంలో ఆశించిన మార్కులు వచ్చేవి కాదు. దీంతో నిరుత్సాహపడేది. తక్కువ మార్కులు వచ్చాయన్న విషయాన్ని నాన్న సాయికృష్ణ పెద్దగా పట్టించుకునేవారు కాదు. చదువును ప్రేమించే మనస్తత్వం తన చిన్నారికి ఉందా లేదా అన్నదే గమనించేవారు. నిరుత్సాహంతో ఉన్న ఆమెకు జీవితంలో ఒడిదొడుకులు ఎలా వస్తాయో, ఎలా ఎదుర్కోవాలో తెలియజెప్పేవారు. మార్కుల ఆధారంగా జీవితాన్ని తూకం వేసుకోవద్దని అనేవారు. లక్ష్యం కోసం చేసే ప్రయత్నం స్థాయిని మరింత పెంచుకోమని ప్రోత్సహించేవారు. మూడేళ్ల ఆయన మాటలు ఫలితంగా ప్రేరణ పొందిన ఆత్రేయి ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేని స్థాయిలో ముందుకు దూసుకుపోయింది. రోజూ చదువుకునే క్రమంలో శారీరక, మానసిక సమస్యలను అమ్మ అచ్చియ్యమ్మ తీర్చి లక్ష్యం వైపు అడుగులు వేసేందుకు తోడ్పాటునిచ్చారు. ఇటీవల విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో ఆల్‌ ఇండియా ఓపెన్‌ కేటగిరీలో ఆత్రేయి 296వ ర్యాంక్‌ను సాధించింది. ఫిబ్రవరిలో విడుదలైన జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో 99.98 స్కోర్‌తో ప్రతిభ కనబర్చింది. ఏపీఈపీసెట్‌ ఫలితాల్లో ఇంజినీరింగ్‌లో 91వ ర్యాంక్‌ సాధించింది. ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు దక్కింది. అనంతరం సివిల్స్‌లో ఐఏఎస్‌ చదవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ఆత్రేయి తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement