
దాతలు సహకరించాలి
నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి దాతలు సహకరించాలి. ఇప్పటికే అనేక మంది దాతలు, భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి పుణ్యక్షేత్రానికి రోజూ వేలాది మంది వస్తున్నారు. వారికి ఇబ్బంది రాకుండా నిత్యాన్నదానం చేస్తున్నాం. అంతేకాకుండా పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మానవ సేవే.. మాధవ సేవగా భావించి ముందుకు వెళ్తున్నాం.
–మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర,
పీఠాధిపతులు, ఏలూరు
భవిష్యత్తులో మరింత
విస్తరిస్తాం..
దాతలు, పీఠాధిపతులు జయరావు పొలిమెర సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రోజూ 3 వేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నాం. అన్ని మతాలకు చెందిన భక్తులు అన్నదానం కార్యక్రమానికి సహకరిస్తున్నారు. కార్తిక మాసంలో అయ్యప్ప, భవానీ భక్తులు కూడా ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. భవిష్యత్తులో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం.
–రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్, డైరెక్టర్, నిర్మలగిరి పుణ్యక్షేత్రం, గౌరీపట్నం

దాతలు సహకరించాలి