మహా సంస్థానం రెగ్యులర్‌ ఈఓగా సౌజన్య | - | Sakshi
Sakshi News home page

మహా సంస్థానం రెగ్యులర్‌ ఈఓగా సౌజన్య

Jun 12 2025 3:13 AM | Updated on Jun 12 2025 3:13 AM

మహా స

మహా సంస్థానం రెగ్యులర్‌ ఈఓగా సౌజన్య

పిఠాపురం: పిఠాపురంలో ప్రముఖ దత్త పుణ్య క్షేత్రమైన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం రెగ్యులర్‌ ఈఓగా ఆర్‌.సౌజన్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అదనపు బాధ్యతలు నిర్వర్తించిన ఆమెకు దేవదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు రెగ్యులర్‌ ఈఓగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

వనదుర్గమ్మకు ఘనంగా

ప్రత్యంగిర హోమం

అన్నవరం: రత్నగిరి దుర్గామాతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి జ్యేష్ట పౌర్ణిమ సందర్భంగా బుధవారం ఘనంగా ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. 11 గంటలకు హోమగుండంలో హోమద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ప్రత్యంగిర హోమం, పూజ కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. 40 మంది భక్తులు రూ.750 చొప్పున టికెట్లు కొనుగోలు చేసి హోమంలో పాల్గొన్నారు. దీంతో భక్తులకు హోమ మంటపం సరిపోక ఇబ్బంది పడ్డారు.

నేడు కనకదుర్గ అమ్మవారికి చండీ హోమం

కొండ దిగువన తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం సందర్బంగా గురువారం చండీహోమం నిర్వహిస్తారు. శుక్రవారం వనదుర్గ అమ్మవారికి చండీహోమం నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి జరిగే ఈ హోమాలలో రూ.750 టిక్కెట్‌తో భక్తులు పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు.

జిల్లా ఇన్‌చార్జి సహకార

అధికారిగా కుమార్‌

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లా ఇన్‌చార్జి సహకార అధికారిగా పీబీఎంఎం కుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సహకార అధికారిగా పనిచేసిన వెంకటకృష్ణ సాధారణ బదిలీల్లో భాగంగా కర్నూల్‌ జిల్లా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కుమార్‌ను నియమించారు.

మహా సంస్థానం  రెగ్యులర్‌ ఈఓగా సౌజన్య 1
1/2

మహా సంస్థానం రెగ్యులర్‌ ఈఓగా సౌజన్య

మహా సంస్థానం  రెగ్యులర్‌ ఈఓగా సౌజన్య 2
2/2

మహా సంస్థానం రెగ్యులర్‌ ఈఓగా సౌజన్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement