నీట్‌ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

నీట్‌ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం

Jun 15 2025 8:17 AM | Updated on Jun 15 2025 8:17 AM

నీట్‌ ఫలితాల్లో  తిరుమల ప్రభంజనం

నీట్‌ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం

రాజమహేంద్రవరం రూరల్‌: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిర్వహించిన మెడికల్‌ ప్రవేశ పరీక్ష నీట్‌లో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. ఓపెన్‌ కేటగిరీలో డి.కార్తీక్‌ రామ్‌కిరీటికి ఏపీ ఫస్ట్‌ ర్యాంకుతో పాటు ఆలిండియా 19వ ర్యాంకు సాధించాడన్నారు. వివిధ కేటగిరీల్లో కె.ఈప్సిత్‌ కశ్యప్‌ 12వ ర్యాంకు, డి.కార్తీక్‌రామ్‌ కిరిటీ 18వ ర్యాంకు, టి.సాహితి 32వ ర్యాంకు, కేవీవీ నాగసాయిపవన్‌ 154వ ర్యాంకు, ఎం.సూర్యసంతోష్‌రెడ్డి 880వ ర్యాంకు, ఎల్‌.అభిషేక్‌ 888 ర్యాంకు, టి.రామచంద్రన్‌ 1,145వ ర్యాంకు, ఎల్‌.వర్షిత్‌ 1,237వ ర్యాంకు, పి.ప్రశంస 1,851వ ర్యాంకు, కె.విన్షిత 1,909వ ర్యాంకును కై వసం చేసుకున్నారన్నారు. వెయ్యిలోపు ఆరుగురు, ఐదు వేల లోపు 35 మంది, 10 వేల లోపు 71 మంది, 20 వేల లోపు 138 మంది, 30 వేల లోపు 189 మంది ర్యాంకులు సాధించారని, 250 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు సాధిస్తారని ఆయన తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నున్న తిరుమలరావు, అకడమిక్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపల్‌ వి.శ్రీహరిలు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement