మూడు దశల్లో ‘పంచాయతీ’ | - | Sakshi
Sakshi News home page

మూడు దశల్లో ‘పంచాయతీ’

Sep 30 2025 7:53 AM | Updated on Sep 30 2025 7:53 AM

మూడు దశల్లో ‘పంచాయతీ’

మూడు దశల్లో ‘పంచాయతీ’

గ్రామ పంచాయతీకి సంబంధించి తొలి విడతలో అక్టోబర్‌ 17 నుంచి 31 వరకు 16 మండలాల పరిధిలోని 410 జీపీలతోపాటు 3,514 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో అక్టోబర్‌ 21 నుంచి నవంబర్‌ 4 వరకు 28 మండలాల్లోని 611 జీపీలతోపాటు 5,546 వార్డులకు.. చివరి దశలో అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 8 వరకు 33 మండలాల పరిధిలోని 657 జీపీలతోపాటు 6,008 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం తొలి విడతలో పోలింగ్‌ నిర్వహించడం లేదు. రెండు, మూడో విడతల్లోనే ఆ రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కాగా.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపడుతారు. కాగా.. పంచాయతీ ఎన్నికలకు గాను 2,363 పోలింగ్‌ కేంద్రాలు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement