ములుగు రూరల్: ఈ నెల 9న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మంకిడి రవి పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఆదివారం సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు ఐక్యంగా ఉండి హక్కుల సాధనకు పోరాటాలు చేయాలని తెలిపారు. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఆదివాసీ దినోత్సవానికి మహిళా ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు అల్లెం అప్పయ్య, ప్రధాన కార్యదర్శి అన్నవరం రవికాంత్, అర్రెం నారాయణ, బాబురావు, ఈక కుమారస్వామి, రామకృష్ణ, రాజేష్కుమార్, సందీప్, జగ్గారావు, అశోక్, కుమారస్వామి, రాజబాబు, రాంచందర్, నారాయణ, మనోజ్ పాల్గొన్నారు.


