
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా
కాళేశ్వరం: మేడిగడ్డ వద్ద గోదావరిలో ఈతకు వెళ్లి మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. బుధవారం మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో ఈనెల 7న మేడిగడ్డ సమీపంలోని గోదావరిలో ఈతకు వెళ్లి మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి, మృతుల వివరాలపై ఆరా తీశారు. మేడిగడ్డ సమీపంలో గోదావరి వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మరో ఘటన జరకముందే రక్షణ చేర్యలు తీసుకోవాలన్నారు. అంతకు మందు సూరారంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. రిటైర్డ్ ఉద్యోగులు ఆయనను శాలువాతో సన్మానించారు. వారి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ