
సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన్ మొదలుకొని అనేక రకాల ఫీజుల పేరుతో దోచుకుంటున్నాయి. పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫాం, స్టేషనరీ పాఠశాలలోనే కొనుగోలు చేయాలనే నిబంధనలు పెడుతూ అధిక మొత్తంలో డబ్బులు లాగుతున్నారు. బహిరంగమార్కెట్ కంటే 15శాతం ఎక్కువ ధర వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
75 ప్రైవేట్ పాఠశాలలు..
జిల్లాలో 75 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ప్రాథమిక, హైస్కూల్ స్థాయిల్లో నడుస్తున్నాయి. సుమారు 15వేల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఎల్కేజీ విద్యార్థులకు సగటున రూ.25వేలు, పదోతరగతి విద్యార్థులకు రూ.50 వేలు ఫీజు తీసుకుంటున్నారు. వీటితో పాటు పాఠశాలల్లోనే పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులు కొనుగోలు చేయాలనే నిబంధనలు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో అవే పుస్తకాలు రూ.10నుంచి 15శాతం తగ్గింపు ధరతో దొరుకుతున్నాయి. అమ్మకాల విషయంలో పాఠశాలల యాజమాన్యాలు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నాయి. పుస్తకాలు, నోటు బుక్కులతో పాటు పెన్ను నుంచి పెన్సిల్ వరకు బ్యాడ్జి నుంచి స్కూల్ డ్రెస్సు, స్కూల్ షూ కూడా పాఠశాలలోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పుస్తకాలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.3వేల నుంచి 8వేల వరకు వెచ్చించాల్సి వస్తుంది.
కనీస సౌకర్యాలు కరువు
చాలా పాఠశాలల్లో రేకుల గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. వెలుతురు సరిగా లేక, ఫ్యాన్లు తిరగక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆటస్థలాలు కూడా ఎక్కువ పాఠశాలల్లో లేవు. దీంతో క్రీడలు లేక విద్యార్థులు మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. పేరెంట్స్ కమిటీలను యాజమాన్యాలు కాగితాలకే పరిమితం చేస్తున్నాయి. పట్టించుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం..
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించుకోవాలి. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ప్రైవేట్ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. – రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓ
నిబంధనలు ఇవి..
● ప్రైవేట్ పాఠశాలల్లో వసతులకు సరిపడా తరగతి గదులు ఉండాలి
● భవన నిర్మాణ నాణ్యత ధ్రువీకరణ పత్రం ఉండాలి.
● విద్యార్థుల మానసిక ఎదుగుదల కోసం ఆటస్థలం, లైబ్రరీ, ప్రహరీ, అగ్నిమాపక శాఖ జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి.
● తాగునీటి వసతి, ప్రథమచికిత్స, కంప్యూటర్ గది, సిబ్బంది గది, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఖచ్చితంగా ఉండాలి.
● విద్యాహక్కు చట్టం ప్రకారం బీఎడ్, డీఎడ్ పూర్తిచేసిన వారు బోధన చేయాలి.
● తరగతి గదుల్లో అవసరమైనంత వెలుతురు ఉండాలి.
● పిల్లలు రోడ్డు దాటడానికి సౌకర్యం కల్పించాలి.
● పోషకుల కమిటీ, ఫీజు వివరాలు నోటీసు బోర్డుపై అతికించటం, ప్రభుత్వ పుస్తకాలతోనే విద్యాబోధన చేయటం, ఒక తరగతి గదిలో 40మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ కోసం అనుమతి తీసుకోవటం, ప్రీ ప్రైమరీ కోసం అనుమతి తీసుకోవటం, తదితర వసతులు ఉండాలి.
న్యూస్రీల్
ప్రైవేట్ పాఠశాలల్లో భయపెడుతున్న ఫీజులు, సామగ్రి ఖర్చు
పుస్తకాలు, యూనిఫాం విక్రయాలకు సొంత కౌంటర్లు
15శాతం వరకు అదనంగా వసూలు

సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025