
రెండేళ్లుగా గుంతలమయం..
టేకుమట్ల: మండలంలోని వెలిశాల–గర్మిళ్లపల్లి ప్రధాన రోడ్డు నుంచి వెంకట్రావుపల్లికి వెళ్లే దారి సుమారు కిలో మీటర్ మేర రెండు సంవత్సరా లుగా గుంతలమయంగా మారింది. భారీ వాహనాల రాకతో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. నిత్యం వెంకట్రావుపల్లి, బూర్నపల్లి, ద్వారకపేట ప్రజలే కాకుండా కిష్టంపేట మీదుగా కాల్వశ్రీరాంపూర్కు వెళ్లే వాహనదారులు అదే దారి గుండా ప్రయాణించాలి. వాహనదారులు పగలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళలో మరీ దారుణంగా ఉంటుంది. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులకు నిధులు కేటాయించి రోడ్డును నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.