
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కల్యాణ కట్టలో పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. సుమారుగా 10వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. మంత్రి సీతక్క దృష్టిసారించి భక్తుల కావాల్సిన సౌకర్యాలను దేవాదాయశాఖ అధికారులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పూజారులు కోరుతున్నారు.