చిట్యాల: మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈడీఏం శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పలు మీసేవ కేంద్రాలను తనిఖీ చేశారు. మీసేవ కేంద్రాల్లో అందించే సేవలను, సౌకర్యాలను పరిశీలించారు. నిర్వాహకులు సమయపాలన పాటించాలని, ప్రభుత్వం నిర్ధేశించిన రుసుం మాత్రమే తీసుకోవాలన్నా రు. మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవల ధరల పట్టికను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మీసేవ కేంద్రాలకు వచ్చిన ప్రజల ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నాగరాజుకు
దళిత సేవారత్న అవార్డు
కాళేశ్వరం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీడాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దళిత సేవారత్న అవార్డులను అందజేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన రేవెల్లి నాగరాజుకు దళిత సేవారత్న అవార్డు అందున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆయనను అభినందించారు.
క్రమశిక్షణతోనే
విజయం సాధ్యం
భూపాలపల్లి రూరల్: క్రీడాకారులు క్రమశిక్షణతోనే ఆటలు ఆడితే విజయం వరిస్తుందని ఎస్సై సాంబమూర్తి అన్నారు. బుధవారం జి ల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సురిమిల్ల శ్రీని వాస్ ఆధ్వర్యంలో మహబూబ్బాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య అండర్–19 షిఫ్ట్ లీగ్ మ్యాచ్ నిర్వహించారు. క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్తో కలిసి ఎస్సై సాంబమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ క్రీడాకారులు రాజు, తిరుపతి, సంపత్, సంతోష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పోల్ట్యాక్స్ను రద్దు చేయాలి
భూపాలపల్లి అర్బన్: కేబుల్ ఆపరేటర్లపై రాష్ట్ర ప్రభుత్వం భారం మోపుతున్న పోల్ ట్యాక్స్ను వెంటనే రద్దు చేయాలని ఇండిపెండెంట్ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేశాల రమేశ్బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై బుధవారం జి ల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్క్లబ్లో కేబుల్ ఆపరేటర్లతో కలిసి మాట్లాడారు. గత 30 ఏళ్లుగా ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకు న్న స్వయంకృషితో కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజలకు వినోదాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు సంబంధించిన సమాచారం అందించడంలో కే బుల్ ఆపరేటర్లు ముందు వరుసలో ఉంటున్నారన్నారు. ప్రస్తుత సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్లతో పోటీ పడడం కష్టమవుతుందన్నారు. ఇప్పటికే నష్టాల్లో నడుపుతున్న కేబుల్ ఆపరేటర్లపై భారం మోపడం సరికాదన్నారు. వెంటనే అధికారులు ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు బొట్ల రాజు, ఓదెల సురేష్, నల్లవేని రాజు, నన్నపు సతీష్, ఐలయ్య, గట్ట య్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన సేవలు అందించాలి
మెరుగైన సేవలు అందించాలి