వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Jun 12 2025 3:13 AM | Updated on Jun 12 2025 3:13 AM

వాతావ

వాతావరణం

జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.

కారుణ్య నియామక

ఉత్తర్వుల అందజేత

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలో కారుణ్య పద్ధతి ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు బుధవారం కారుణ్య నియామక ఉత్తర్వులను అందజేశారు. ఏరియా జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై నియామక పత్రాలు అందించి మాట్లాడారు. సంస్థలో నూతనంగా ఉద్యోగంలో చేరుతున్న వారు అంకితభావంతో పనిచేయాలని కోరారు. మహిళా ఉద్యోగులు భూగర్భ గనుల్లోకి వెళ్లి విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు జోతి, సురేఖ, మారుతి, శ్రావణ్‌కుమార్‌, ప్రణయ్‌సాగర్‌, కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాస్‌, మధుకర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహేందర్‌

భూపాలపల్లి రూరల్‌: ఎన్‌హెచ్‌ఆర్‌సీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్హర్‌ మండడాలనికి చెందిన వెల్పుల మహేందర్‌ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు దుండ్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయనకు నియామక పత్రం అందించారు. ఈ నియామకానికి సహకరించిన జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ల భద్రయ్యకు, జిల్లా అధ్యక్షుడు కుమార్‌ యాదవ్‌లకు మహేందర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

నేడు జస్టిస్‌

పీసీ ఘోష్‌ పర్యటన

హన్మకొండ: కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్‌ చైర్మన్‌, సుప్రీంకోర్టు పూర్వ జడ్జి జస్టిస్‌ పీసీ ఘోష్‌ గురువారం హనుమకొండ, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకున్న ఆయనకు కలెక్టర్‌ పి.ప్రావీణ్య మొక్క అందించి స్వాగతం పలికారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.45 గంటలకు రామప్పకు చేరుకుంటారు. రామప్పలో దైవదర్శనం చేసుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 12.15 రామప్పలో బయలుదేరి 1.30 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి మూడు గంటలకు హైదరాబాద్‌ వెళ్తారు.

వాతావరణం
1
1/1

వాతావరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement