
‘భూభారతి’తో ప్రతీ రైతుకు న్యాయం
భూ భారతి చట్టంతో ప్రతీ రైతుకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
– 8లోu
ఉపాధ్యాయులంటే భయం, భక్తి..
చిట్యాల: మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదవాను. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. నాడు ఉపాధ్యాయులు భయంతో కూడిన ప్రేమ చూపేవారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు వచ్చి చెప్పేవారు. ఉపాధ్యాయులు అంటే భయం భక్తి ఉండేది. తల్లిదండ్రులు ఆనాడు ఉపాధ్యాయులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. భయంతో చదువుకున్నాం. భీంరావు వాగు వచ్చినా కూడా సైకిల్పై వచ్చి పాఠాలు బోఽధించే వారు. తొలిరోజు విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందంటే ఎలాంటి భయం లేకుండా త్వరగా తయారై మిత్రులను కలుపుకొని పాఠశాలకు వెళ్లేవాడిని. ఆ రోజుల్లో సెల్ఫోన్, ల్యాండ్ఫోన్ లేదు. పాత మిత్రులను కలవాలని ముందుగానే వచ్చి కలుసుకునేవాళ్లం.
– తూటిచర్ల, స్వామి, సీఐ, ఖమ్మం