రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

Jun 12 2025 3:13 AM | Updated on Jun 12 2025 3:13 AM

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

మల్హర్‌: భూభారతి రెవెన్యూ సదస్సులను సద్విని యోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ అన్నారు. మండలంలోని వల్లెంకుంట గ్రా మంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చిందన్నారు. రైతులు ఏ సమస్యలు ఉన్నా దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి భూ సంబంధిత సమస్యలను తెలుసుకున్నారు. భూ నమోదులు, రికార్డులు సర్దుబాటు, వాస్తవికంగా భూములపై ఉన్న హక్కుల విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించి, సంబంధిత రెవెన్యూ అధికారులకు తగిన సూచనలు చేశారు. భూముల సర్వే నంబర్ల చేర్పులు మార్పుల్లో పేరు నమోదు కోసం వల్లెంకుంటలో 337, మల్లంపల్లిలో 68 దరఖాస్తులను రైతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రవి కుమార్‌, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement