బుధవారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2025

Jun 11 2025 9:06 AM | Updated on Jun 11 2025 9:06 AM

బుధవా

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2025

8లోu

కఠినంగా శిక్షించాలి

నాసిరకం విత్తనాలను అంటగట్టి మోసాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలు రాకుండా వ్యవసాయ, పోలీసుశాఖల అధికారులు చూడాలి. కొన్నిచోట్ల నకిలీ విత్తనాలు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. విత్తన దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి నాణ్యమైన విత్తనాలను విక్రయించేలా చూడాలి.

– మ్యాకల యాదయ్య, రైతు, పీచర, వేలేరు మండలం

నకిలీ విత్తనాలను అరికట్టాలి..

మార్కెట్లోకి నకిలీ విత్తనాలు రాకుండా అధికారులు చర్యలు చేపట్టి రైతులకు నాణ్యమైన పత్తి విత్తనాలు అందించాలి. ముందస్తు వర్షాలు పడడంతో పత్తి విత్తనాలు వేసేందుకు భూమిని సిద్ధం చేశాం. ప్రతి ఏటా నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి వస్తుండడంతో రైతులం నష్టపోతున్నాం. నకిలీ, అసలు విత్తనాలకు తేడా తెలియక ఆందోళనకు గురవుతున్నాం. వీటిపై అవగాహన కల్పించాలి.

– ముంజ సాంబయ్య,

రైతు, వెంకటాపురం (ఎం), ములుగు జిల్లా

నకిలీ విత్తనాలు, మందులు

విక్రయిస్తే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా వ్యాపారస్తులు, సంస్థలు, వ్యక్తులు రైతన్నను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను, పురుగు మందులు విక్రయిస్తే పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేస్తాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి టీమ్‌లను రంగంలోకి దింపాం. నకిలీల సమాచారం తెలిస్తే తక్షణమే మాకు అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం.

– సన్‌ ప్రీత్‌సింగ్‌, పోలీస్‌ కమిషనర్‌, వరంగల్‌ కమిషనరేట్‌

రైతుల మెడపై నకిలీ విత్తనాల కత్తి

సీజన్‌ ఆరంభంనుంచే దందా

పత్తి విత్తనాల కృత్రిమ కొరత... తప్పని అధిక ధరల మోత

పత్తి, వరి విత్తనాల్లోనే నకిలీ ఎక్కువ..

ఇటీవల పట్టుకున్న పోలీసులు

నిఘా పెంచాలని కోరుతున్న రైతులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ప్రస్తుత వానాకాలం సీజన్‌కు నకిలీ పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. ఓ వైపు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాలనుంచి భారీగా రవాణా అవుతుండగా.. మరోవైపు ముఠాలుగా ఏర్పడిన కొందరు ఉమ్మడి వరంగల్‌వాసులు ఈ ‘నకిలీ’లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాలను కేంద్రాలుగా చేసుకొని ఈ దందా సాగిస్తున్నారు. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ముందు జాగ్రత్తగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడిన నకిలీ విత్తనాలే ఇందుకు ఉదాహరణ.

గత మార్చి నెలాఖరులో హనుమకొండ జిల్లాలో రూ.78.63 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాసభ్యులు గతంలో కూడా నకిలీ పత్తి, మొక్కజొన్న విత్తనాలు విక్రయించినట్లు కేసులున్నాయి.

తాజాగా వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌, గీసుకొండ, పరకాల పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురుని అరెస్టు చేసి రూ.63.62 లక్షల విలువ చేసే 166 కిలోల నకిలీ విత్తనాలు, 800 లీటర్ల గడ్డిమందు, నకిలీ పురుగుల మందు తయారీకి అవసరమైన సామగ్రి, 7 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

యాసంగిలో ములుగు జిల్లా వెంకటాపురం, కన్నాయిగూడెం, వాజేడు, మండలాల్లోని 55 గ్రామాల్లో పేరొందిన కంపెనీలవని నమ్మిన రైతులు.. 1,370 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. అవి నకిలీవి కావడంతో 618 మంది రైతులు నష్టపోగా, అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదయ్యాయి.

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 20251
1/4

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2025

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 20252
2/4

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2025

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 20253
3/4

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2025

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 20254
4/4

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement