14న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

14న జాతీయ లోక్‌ అదాలత్‌

Jun 11 2025 9:00 AM | Updated on Jun 11 2025 9:00 AM

14న జ

14న జాతీయ లోక్‌ అదాలత్‌

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని కోర్టులలో ఈ నెల 14వ తేదీన జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబు కోరారు. మంగళవారం పోలీస్‌ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాజీమార్గాన్ని ఎంచుకొని వివాదరహిత జీవితాలను గడిపే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల్లో రాజీపడితే ఇరువర్గాలకు మంచిదన్నారు. పెద్దఎత్తున కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగరాజు, జూనియర్‌ సివిల్‌ జడ్జి దిలీప్‌కుమార్‌ నాయక్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అఖిల, అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, డీఎస్పీ సంపత్‌రావు, సర్కిల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించకుంటే లైసెన్స్‌ రద్దు

కాటారం: విత్తనాల విక్రయ డీలర్లు, ఫర్టిలైజర్‌ దుకాణాల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేపడితే లైసెన్స్‌ రద్దుచేస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరునాయక్‌ హెచ్చరించారు. కాటారం మండలకేంద్రంలోని విత్తన విక్రయ దుకాణాలు, ఫర్టిలైజర్‌ షాపులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. దుకాణాల్లో స్టాక్‌ రిజిస్టర్లు, నిల్వలు, విత్తనాల ప్యాకెట్ల కంపెనీలను డీఏఓ పరిశీలించారు. నాసిరకం, లూజ్‌ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ప్రభుత్వ ఆమోదం పొందిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు మాత్రమే విక్రయించాలని పేర్కొన్నారు. రైతులకు తప్పనిసరిగా కొనుగోలు రశీదు ఇవ్వాలని ఆదేశించారు. విత్తనాల నిల్వలు, విక్రయాలను ఎప్పటికప్పుడు స్థానిక వ్యవసాయశాఖ అధికారికి తెలియజేయాలని తెలిపారు. ఈ తనిఖీల్లో ఏడీఏ శ్రీపాల్‌, కాటారం, మహదేవపూర్‌ ఏఓలు పూర్ణిమ, సుప్రజ్యోతి పాల్గొన్నారు.

అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం

భూపాలపల్లి రూరల్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు ఆట పాటలతో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు, తల్లిదండ్రులు బడీడు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఇన్‌చార్జ్‌ జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం భూపాలపల్లి పట్ణణం సుభాష్‌కాలనీలో ఏర్పాటుచేసిన అమ్మమాట, అంగన్‌వాడీ బాట కార్యక్రమానికి మల్లీశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్‌వాడీ సెంటర్‌లో ప్రతి పిల్లవాడు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే చదివే విధంగా టీచర్లు, పిల్లల తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ఆరోగ్యపరంగా కిశోర బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ రజిత, అంగన్‌వాడీ టీచర్లు సుజాత, రమ, సుచరిత, అరుణ, ఉమామహేశ్వరి, సునీత, ఆయాలు పాల్గొన్నారు.

రైతులు నాణ్యమైన

విత్తనాలు నాటాలి

చిట్యాల: రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని నాటుకోవాలని భూపాలపల్లి డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్‌.రమేష్‌ అ న్నారు. మండలకేంద్రంలోని పలు ఫర్టిలైజర్‌ షాపులలో మంగళవారం వ్యవసాయశాఖ, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తనిఖీల్లో భాగంగా వివిధ కంపెనీల విత్తన ప్యాకెట్లను, క్రయవిక్రయ రశీదులను, స్టాక్‌ రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు విత్తన కొనుగోలు సమయంలో జాగ్రత్త వహిస్తూ నాణ్యమైన విత్తనాలనే ఎంపిక చేసుకుని నాటుకోవాలన్నారు. బీటీ–3 పత్తి విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో బీటీ–3 విత్తనాలను పెట్టవద్దని సూచించారు. ఇక వేళ సాగుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై శ్రావన్‌కుమార్‌, ఏఈఓ రమణకుమార్‌ పాల్గొన్నారు.

14న జాతీయ లోక్‌ అదాలత్‌
1
1/1

14న జాతీయ లోక్‌ అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement