
మీడియాపై కక్ష సాధింపు చర్యలు
భూపాలపల్లి అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియాపై చేస్తున్న కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని భూపాలపల్లి కాకతీయ ప్రెస్క్లబ్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. సాక్షి సీనియర్ రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాస్రావు అరెస్ట్, సాక్షి కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష కట్టి సాక్షి దినపత్రిక, న్యూస్చానల్పై దాడులు చేస్తోందన్నారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టులు సరికాదన్నారు. 50 ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావును అధికారం ఉందనే అహంకారంతో అరెస్టు చేయడాన్ని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. అక్రమ అరెస్టులతో ఇబ్బంది పెడుతున్న ఏపీ ప్రభుత్వం భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రవిభాస్కర్, శ్యాం, సంపత్, సరేశ్వర్రావు, సుధాకర్, ప్రవీణ్, వెంకటస్వామి, జగన్, రాజేష్, మహేందర్, సాంబయ్య, నరేందర్, చంద్రమౌళి, శేఖర్, సుమన్, సతీష్, నరేందర్ పాల్గొన్నారు.
దాడులను నిరసిస్తూ
జర్నలిస్టుల ఆందోళన