జగిత్యాలటౌన్: జగిత్యాలరూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన గీత కార్మికుడు, రచరు ుత శ్రీనివాస్గౌడ్ రాసిన బతు కుతాడు నవలను కాకతీయ యూనివర్సిటీ తెలుగు పాఠ్యాంశంగా పొందుపరిచారు. 2026 –27 విద్యాసంవత్సరానికి ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం నాలుగో సెమిస్టర్ మూడో పేపర్గా నవల ఎంపిక కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన సాహిత్యంపై అంబేడ్కర్, ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధనలు చేసినట్లు తెలిపారు. నవలను పాఠ్యాంశంగా ఎంపిక చేసిన వర్సిటీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
రాజేశ్వర్రావుపేట పంప్హౌస్ నుంచి ఎత్తిపోతలు
మెట్పల్లి రూరల్: మండలంలోని రాజేశ్వర్రావుపేట పంప్ హౌస్ నుంచి ఆదివారం ఎత్తిపోతలను అధికారులు ప్రారంభించారు. ఎల్లంపెల్లి నుంచి వరదకాలువకు నీటి విడుదల చేయగా రాజేశ్వర్రావుపేట పంప్హౌస్కు చేరుకున్నాయి. అధికారులు మోటార్లను ఆన్ చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


