
ఘనంగా సంకటహర చతుర్థి
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం మహాగణపతి ఆలయంలో శనివారం సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్శర్మ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
‘కేటీఆర్పై రాజకీయ కక్ష’
జగిత్యాలరూరల్: మాజీమంత్రి కేటీఆర్పై ఫార్ములా ఈ కేసులో ప్రభుత్వం రాజకీయ కక్ష సా ధిస్తోందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం గుల్లపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందని కే టీఆర్పై కేసు పెట్టి ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఫార్ములా ఈ రేసును కేటీఆర్ హైదరాబాద్కు తీసుకొచ్చి బ్రాండ్ ఇమేజ్ పెంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వం స్కామ్లు చేసిందని చెప్పుకుంటూ ప్రజలను వంచిస్తోందన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లిన రేవంత్రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆనందరావు, కల్లెడ సింగిల్ విండో చైర్మన్ సందీప్రావు, మాజీ సర్పంచ్ తిరుపతి, యూత్ నాయకులు హరీశ్, మహేశ్, బాలె చందు పాల్గొన్నారు.
గర్భాశయ క్యాన్సర్ నివారిద్దాం
జగిత్యాల: గర్భాశయ క్యాన్సర్ నివారణకు కృషి చేద్దామని ఐఎంఏ అధ్యక్షుడు గూడూరి హేమంత్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో గైనకాలజీ అసోసియేషన్ వారు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. ప్రతినెలా రెండో శనివారం శిబిరం ఏర్పాటు చేస్తామని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. డాక్టర్ పద్మిని మాట్లాడుతూ.. క్యాన్సర్ మరణాలు పెరుగుతున్న తరుణంలో ప్రతిఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి సుధీర్కుమార్, వడ్డెపల్లి సాయి, నవీన్, పూర్ణచంద్ర, శ్రీలత పాల్గొన్నారు.
ఐఐటీ కాన్పూర్లో సీటు సాధించిన యువకుడు
జగిత్యాల: ప్రతిష్టాత్మక కాన్పూర్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో జగిత్యాల సాయికిరణ్ అనే యువకుడు సీటు సాధించాడు. పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన రాధాకృష్ణ, ఆకుల శ్రీలత దంపతుల కుమారుడు సాయికిరణ్. మొదటి నుంచే చదువులో చురుకుగా ఉన్న సాయికిరణ్ పదో తరగతిలో 10 జీపీఏ సాధించాడు. ఇంటర్లో 96.6 శాతం సాధించి ఎంసెట్లో 208 ర్యాంక్ సాధించాడు. జేఈఈ మెయిన్స్లో ఓబీసీలో 144 ర్యాంక్, జేఈఈ అడ్వాన్స్లో ఓబీసీలో 112 ర్యాంక్ సాధించాడు. అతనికి ఇండియాలోనే టాప్ కాలేజ్ అయిన ఐఐటీ కాన్పూర్లో సీటు రాగా పలువురు అభినందించారు.

ఘనంగా సంకటహర చతుర్థి

ఘనంగా సంకటహర చతుర్థి

ఘనంగా సంకటహర చతుర్థి