
ఇల్లు పూర్తి చేయండి.. రూ.10,116 అందుకోండి
కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గం పరిధిలో ఇందిరమ్మ ఇంటిని మొదట పూర్తి చేసిన వారికి రూ.10,116 ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ప్రకటించారు. కోరుట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో సుమారు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, 62 గ్రామాల్లో భూమిపూజ పూర్తి చేశామని, చాలా ఇళ్లు పునాదుల స్థాయిలో ఉన్నాయని, అయితే ఎవరైతే ఇంటి నిర్మాణాన్ని ముందుగా పూర్తి చేసుకుంటారో వారికి తాను స్వయంగా రూ.10.116 కానుకగా ఇస్తానని ప్రకటించారు. ఇది రెండు మున్సిపాల్టీలు, రెండు మండలాల్లోని లబ్ధిదారులకు వర్తిస్తుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అన్నం అనిల్, కోరుట్ల పట్టణ, మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజం ఉన్నారు.