Operation Sindoor: శాంతించండి.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై.. భారత్‌కు చైనా రిక్వెస్ట్‌ | China Message To India Over Operation Sindoor, More Details Inside | Sakshi
Sakshi News home page

China On Operation Sindoor: శాంతించండి.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై.. భారత్‌కు చైనా రిక్వెస్ట్‌

May 7 2025 9:52 AM | Updated on May 7 2025 10:16 AM

China Message To India over Operation Sindoor

బీజింగ్‌: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్‌ మంగళవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడికి దిగింది. ఈ ఊహించని పరిణామంపై చైనా స్పందించింది. ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌-పాక్‌ల మద్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల వేళ చైనా ఇరు దేశాలకు శాంతి సందేశం పంపించింది. దాయాది దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది.

భారత్‌-పాక్‌ దాయాది దేశాలు. ఆ రెండు కూడా మాకు (చైనా)పొరుగు దేశాలు. అయినప్పటికీ చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది’ అని  అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఇరు దేశాలు శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను తీసుకోకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement