
15న సీ్త్ర సమ్మిట్ 2.0
లోగో ఆవిష్కరించిన కొత్వాల్ ఆనంద్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మహిళల భద్రతను మరింత పెంచడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్తో (హెచ్సీఎస్సీ) కలిసి సిటీ పోలీసులు ‘సీ్త్ర’ (షీ ట్రంప్స్ థ్రూ రెస్పెక్ట్, ఈ క్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్) పేరుతో మరోసారి సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 2023లో ఓసారి ఈ సదస్సు నిర్వహించారు. ఈ నెల 15న నిర్వహించనున్న రెండో సమ్మిట్కు సంబంధించిన లోగోను కొత్వాల్ సీవీ ఆనంద్ గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. వివిధ వర్గాలకు చెందిన మహిళలు, యువతులతో పాటు నిపుణులు ఈ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు సలహాలు, సూచనలు ఇస్తారు.