‘అమ్మానాన్న.. మమ్మల్ని స్కూల్కు ఎవరు పంపిస్తారు? కొసరి.. కొసరి గోరుముద్దలెవరు తినిపిస్తారు? తమ్ముడిని, నన్ను అనాథల్ని చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మాకు దిక్కెవరు’ అంటూ రవి, శిరీష దంపతుల కుమారులు సుశాంత్, విద్వాన్ష్ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాగా, వ్యాపారం కోసం ఇచ్చిన డబ్బులు వసూల్ చేయడానికి పడుతున్న ఇబ్బందుల వల్ల ఇద్దరు భార్యాభర్తలు 20 రోజులుగా ఇంట్లో గొడవ పడుతున్నారని, కనీసం తిండి కూడా సక్రమంగా తినట్లేదని ఇరుగుపొరుగు వారు తెలిపినట్లు మృతుడి బంధువులు చర్చించుకుంటున్నారు.


