మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా హనుమకొండలోని కొత్త బస్టాండ్ జంక్షన్ వద్ద గల ఆయన కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీశ్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, రెడ్క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవీ శ్రీనివాస్, పీవీ మదన్మోహన్ పాల్గొన్నారు. – హన్మకొండ చౌరస్తా


