పీవీ .. ఆధునిక ఆర్థిక సంస్కరణల రూపశిల్పి | - | Sakshi
Sakshi News home page

పీవీ .. ఆధునిక ఆర్థిక సంస్కరణల రూపశిల్పి

Jun 29 2026 1:53 AM | Updated on Jun 29 2026 1:53 AM

హన్మకొండ: ఆధునిక ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు అని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కా ర్యాలయంలో మాజీ ప్ర ధాని పీవీ నర్సింహారావు జయంతి నిర్వహించా రు. ఈ సందర్భంగా ిపీవీ చిత్ర పటానికి సీఎండీ, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళుర్పించారు. డైరెక్టర్లు వి.మోహన్‌ రావు, వి. తిరుపతి రెడ్డి, సి.ప్రభాకర్‌, చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ బోనాల కిషన్‌, సి.ఈలు కె.వెంకటరమణ, నాగ ప్రసాద్‌, సీజీఎంలు రవీంద్రనాథ్‌, కిషన్‌, జాయింట్‌ సెక్రటరీ శ్రీ కృష్ణ, జీఎంలు హేమంత్‌ కుమార్‌, మనోహర్‌ స్వామి, వేణు బాబు, కళాధర్‌, జయరాజ్‌, వెంకట కృష్ణ, తిరుపతి, ప్రభావతి, డి.ఈ టెక్నికల్‌ భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌

సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement