
నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల క్రీడోత్సవాలు
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలకు విద్యుత్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాట్లు చేసింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ కౌన్సిల్ బాధ్యులు తెలిపారు. ఈ ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రాష్ట్రంలోని టీజీ ట్రాన్స్కో, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్కు చెందిన 12 జట్ల చొప్పున పాల్గొననున్నాయని స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యులు వి.సునీల్కుమార్, ఎండీ.యాకూబ్ పాషా, ఇ.ప్రేంకుమార్ పేర్కొన్నారు. గురువారం ఉదయం 9 గంటలకు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్ ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్టర్లు, స్పోర్ట్స్ కౌన్సిల్ కమిటీ బాధ్యులు, అధికారులు పాల్గొంటారని వివరించారు.
మనబడి పాట ఆవిష్కరణ
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పాలకుర్తి రవి రాసిన మనబడి పాటను బుధవారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ డి.వాసంతి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎశ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, శాయంపేట ఎంఈఓ భిక్షపతి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మందల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఫలిత శ్రీహరి, ఓదెల నరేందర్, పెద్దకోడెపాక జెడ్పీహెచ్ఎస్ పధానోపాధ్యాయుడు సారయ్యనాయక్, ఉపాధ్యాయులు చంద్రయ్య, భాస్కర్, సారంగపాణి పాల్గొన్నారు.
పోలీస్ కుటుంబానికి
భద్రత చెక్కు అందజేత
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూంలో కానిస్టేబుల్గా పనిచేస్తూ అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి 28న మరణించిన వెంకటరమణ కుటుంబానికి పోలీస్ భద్రత విభాగంనుంచి మంజూరైన రూ.7.32 లక్షల చెక్కును సీపీ సన్ప్రీత్సింగ్ బుధవారం ఆ కానిస్టేబుల్ భార్య వాణికి అందజేశారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సూపరింటెండెంట్ రమాదేవి పాల్గొన్నారు.
పరీక్షల పర్యవేక్షణ
అధికారిగా శ్రీదేవి
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్. శ్రీదేవి పరీక్షల పర్యవేక్షణాధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. డిగ్రీ, పీజీ పరీక్షలతోపాటు ఇతర పోటీల పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను శ్రీదేవి నిర్వహిస్తారని తెలిపారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలత, డాక్టర్ నహీద తదితరులు శ్రీదేవిని అభినందించారు.
నేడు జస్టిస్
పీసీ ఘోష్ పర్యటన
హన్మకొండ: కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్టు పూర్వ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ గురువారం హనుమకొండ, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ పి.ప్రావీణ్య మొక్క అందించి స్వాగతం పలికారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.45 గంటలకు రామప్పకు చేరుకుంటారు. రామప్పలో దైవదర్శనం చేసుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు రామప్పలో బయలుదేరి 1.30 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి మూడు గంటలకు హైదరాబాద్ వెళ్తారు.

నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల క్రీడోత్సవాలు

నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల క్రీడోత్సవాలు