ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యటన
తాడికొండ: ఎల్నినో పరిస్థితులను శాసీ్త్రయంగా ఎదుర్కొనేందుకు రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం సోమవారం తాడికొండ మండలంలోని పలు గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన జరిపింది. పత్తి, మినుము, పెసర, కూరగాయలు, కొన్ని ఉద్యాన పంటల్లో ఎదుగుదల మందగించడం, ఆకులు వాడిపోవడం, తేమ కొరత లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. రైతులకు పలు శాసీ్త్రయ సూచనలు అందించారు.


