న్యూస్రీల్
చేసిన పనులకు బిల్లులు ఏవీ?
2021లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో సర్పంచ్లుగా గెలిచారు. తర్వాత కొంత అటూ ఇటూ మారినా ఇప్పటికీ వారిదే హవా కొనసాగుతోంది. చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత పక్షపాత ధోరణితో వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్లకు సంబంధించిన బిల్లులను ఆపేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎం–బుక్ ( మెజర్మెంట్ పుస్తకం) ప్రకారం నమోదైన పనులకు బిల్లులు చెల్లించాలని కొందరు సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. గత 10 రోజుల నుంచి ఎటువంటి బిల్లులు చెల్లించవద్దని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఎవరైనా అప్పటి వరకు పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి ముందుకెళతారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కావాలనే ఆపుతోందనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. అంతేకాదు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన సెస్ మొత్తం రూ.లక్షలల్లో పెండింగ్లో ఉంది. ఇప్పటి వరకు వాటి విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇలా గ్రామాభివృద్ధిని గాలికి వదిలేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ నిర్మాణానికి విరాళం
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఇక గ్రామాల్లోనూ ప్రత్యేక పాలన
ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో
రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్
గత పది రోజుల నుంచి బిల్లులు
క్లియర్ చేయొద్దని ఆదేశాలు
ఎన్నికలు నిర్వహించకుండా
చంద్రబాబు ప్రభుత్వం దాటవేత ధోరణి
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కొనకంచి లక్ష్మయ్య, కుమారి దంపతులు రూ.1.01,116 విరాళంగా అందజేశారు.


