ఫోన్పే ద్వారా కొంత నగదు బదిలీ నగదు లేవని చెప్పడంతో బెదిరింపులు క్రైమ్ బ్రాంచ్ పేరుతో వీడియో కాల్ పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ
తాడేపల్లి రూరల్: వర్క్ ఫ్రం హోమ్ పేరిట మహిళను మోసం చేయడమే కాకుండా.. క్రైం బ్రాంచ్ పోలీసులమంటూ.. సీబీఐ అంటూ బెదిరించిన ఘటనపై కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లి పట్టణ పరిధిలోని కొండా అంకమ్మ గృహిణి. ఆమెతో పాటు అత్త, మామలు కూడా ఉంటున్నారు. ఈక్రమంలో మంగళవారం మధ్యాహ్నం 9846719089 నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది.. అవతలి వ్యక్తి మీకు నటరాజ్ పెన్సిల్ కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చిందని, ముందుగా మీరు సభ్యత్వం తీసుకోవాలని, అందుకు రూ.650 చెల్లిస్తే వివరాలు తెలుపుతామని చెప్పడంతో గృహిణి అయిన కొండా అంకమ్మ రూ. 650లు ఫోన్పే ద్వారా చెల్లించింది. వెంటనే మళ్లీ సదరు వ్యక్తి ఆ మహిళకు ఫోన్ చేసి మీరు నటరాజ్ పెన్సిల్ స్కీమ్లో సెలెక్ట్ అయ్యారని, రూ.1,999లు చెల్లించాలని చెప్పడంతో కొండా అంకమ్మ ఒక్క రూపాయి ఏముందంటూ రూ.2వేలు ఫోన్ పే ద్వారా చెల్లించింది. రెండు వేల రూపాయలు చెల్లిస్తే స్కీమ్కు అనర్హులని, రూ. 1999లు మాత్రమే చెల్లించాలని చెప్పడంతో మళ్లీ వారు చెప్పిన డబ్బులను ఫోన్పే ద్వారా చెల్లించింది. మీ ఇంటికి సాయంత్రం కల్లా ట్రక్తో పెన్సిల్ లోడ్ వస్తుందని, ఛార్జీల నిమిత్తం రూ. 3599లు చెల్లించమనడంతో ఆ నగదు సైతం చెల్లించింది. వెంటనే ఆ వ్యక్తి మీ ఫొటో పెట్టమని చెప్పడంతో సదరు మహిళ తన ఫొటోను పంపించింది.


