విద్యుత్‌ సేవల్లో నాణ్యత ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సేవల్లో నాణ్యత ముఖ్యం

Oct 19 2025 6:19 AM | Updated on Oct 19 2025 6:19 AM

 విద్యుత్‌ సేవల్లో నాణ్యత ముఖ్యం

విద్యుత్‌ సేవల్లో నాణ్యత ముఖ్యం

● సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పీజీఆర్‌ఎస్‌)కు విరామం ప్రకటించినట్లు కలెక్టర్‌ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం దీపావళి కారణంగా రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. ● జిల్లాలో వైద్య సేవలు పేదలకు అందేలా మరింత విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. శనివారం సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఔట్‌ పేషెంట్‌ సేవలు మెరుగు పరచాలన్నారు. ● కాలుష్యం లేని దీపావళిని ఆనందంగా అందరూ జరుపుకోవాలని జిల్లా కలెక్టర్‌ అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో దీపావళిపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్‌, అధికారులు శనివారం సమావేశ మందిరంలో సంయుక్తంగా ఆవిష్కరించారు.

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ సూర్యఘర్‌ పథకం ద్వారా సోలార్‌ యూనిట్లు ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రజల భాగస్వామ్యం కీలకం

గుంటూరు జిల్లాను క్లీన్‌, గ్రీన్‌గా మార్చడానికి ప్రజల భాగస్వామ్యం కీలకం అని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు కాంపౌండ్‌ వద్ద జీఎంసీ ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో క్లీన్‌ ఎయిర్‌ అంశంపై నిర్వహించిన ర్యాలీని కలెక్టర్‌తోపాటు జీఎంసీ కమిషనర్‌ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే గళ్లా మాధవి, నగర మేయర్‌ కొవెలమూడి రవీంద్ర బాబులు ప్రారంభించారు. నగరంలో వాయు కాలుష్యం తగ్గించేలా ఈ సీజన్‌లో 5 లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో హజ్‌ కమిటీ చైర్మన్‌ హసన్‌ బాషా, డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీలా, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ చక్రవర్తి, డీటీసీ సీతారామిరెడ్డి, డీప్యూటీ డీఎంహెచ్‌ఓ సువర్ణబాబు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement