యువత పోరుబాట | - | Sakshi
Sakshi News home page

యువత పోరుబాట

Jun 22 2025 3:46 AM | Updated on Jun 22 2025 3:46 AM

యువత పోరుబాట

యువత పోరుబాట

జాబు పాలనలో పెరిగిన రుబాబు

పార్టీ గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. బాబు వస్తే జాబు అన్నారని.. అది రాకపోగా.. ఇదేమని ప్రశ్నిస్తే రుబాబు ఎక్కువైపోయిందని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నిజం కోసం పరితపించే వ్యక్తి అని పేర్కొన్నారు. చంద్రబాబులాగా నీకు 15వేలు.. నీకు 15వేలు అనిపించి ఉంటే.. వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉండేదని తెలిపారు. గతంలో 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలని అనే వారని, అందుకు అనుగుణంగా చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఆడి అధికారం కోసం వెంపర్లాడతారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ సీపీకీ యువకులే పట్టు గొమ్మలని స్పష్టం చేశారు. గుంటూరు గడ్డ దమ్ము చూపించేలా... 23న జరిగే ‘యువత పోరు’ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబు నయవంచకుడు

తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగే పార్టీ వైఎస్సార్‌ సీపీ అని స్పష్టం చేశారు. చంద్రబాబు నయవంచకుడని, కల్లబొల్లి కబుర్లు చెప్పడం ఆయనకే కొత్తేమి కాదని విమర్శించారు. ఇచ్చిన ప్రతి మాటా ఫెయిల్యూర్‌ అయిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది చంద్రబాబు అని ప్రతి ఒక్కరూ చెబుతారన్నారు. మొద్దునిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని లేపాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.

పార్టీ గుంటూరు పార్లమెంట్‌ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఖండించారు. ఇంకొకడు నీ తల నరికితే తప్పేంటని అంటూ వైఎస్‌ జగన్‌ను అనే స్థాయికి వచ్చారని, దీనిపై ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఆఖరికి పల్నాడులో జరిగిన పర్యటనలో టీడీపీ కార్యకర్తతో ‘రప్ప రప్ప’ అనే పోస్టర్‌ను పట్టించి, వైఎస్సార్‌ సీపీకి అంటగట్టే చౌకబారు రాజకీయాలు చేయటం తగదని హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం వైఎస్‌ జగనన్న ట్యాబ్‌లు అందజేస్తే.. వాటిని చూసి పిల్లలు చెడపోతున్నారని లోకేష్‌ వ్యాఖ్యలు విద్యార్థులు, యువతపై వారికున్న చిత్తశుద్ధికి నిలువెత్తూ నిదర్శమని పేర్కొన్నారు. కచ్చితంగా ప్రభుత్వంపై యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు

పోరుకు సన్నద్ధం కావాలి

మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ దేశానికి భవిష్యత్తు యువత, విద్యార్థులేనని, వారి భవిష్యత్తునే చంద్రబాబు అంధకారంగా మారుస్తున్నారని విమర్శించారు. ఏడాది పాలనలో యువతకు బకాయి పడ్డ ప్రతి రూపాయిని చెల్లించేలా కూటమిపై పోరుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యువత పరిస్థితిని అధ్వానంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

యువజన బలం వైఎస్సార్‌ సీపీ సొంతం

పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేని విద్యార్థి, యువజన బలం వైఎస్సార్‌ సీపీ సొంతమని తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్ల నుంచి యువత పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. 23వ జరిగే యువత పోరును జయప్రదం చేసి రాష్ట్రంలో కూటమి పాలనను ఎండగట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement