కదం తొక్కిన నేతలు, కార్యకర్తలు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన నేతలు, కార్యకర్తలు

Jun 19 2025 4:10 AM | Updated on Jun 19 2025 4:10 AM

కదం త

కదం తొక్కిన నేతలు, కార్యకర్తలు

అరచేతిని అడ్డుపెట్టి అఖండ సూర్యుడి తేజస్సు అడ్డుకోలేనట్లు.. సంక్షేమ సూరీడు.. జన హృదయ నేతను చూసేందుకు వచ్చిన జనతరంగాన్ని ఆంక్షల వలయాలు అడ్డుకోలేకపోయాయి.. ఉవ్వెత్తున ఎగిసిన అభిమాన సంద్రం ముందు నిర్బంధ చట్రాలు చిన్నబోయాయి.. బారులు తీరిన అభిమానం ముందు బారికేడ్లు దూదిపింజలయ్యాయి. ఏమా జనం.. ఏమిటా ప్రభంజనం.. ఇసుకేస్తే రాలనట్లు.. నేల ఈనిందా అన్నట్లు వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ అడుగు పెట్టిన ప్రతి ఊరు జనహోరుతో నిండగా.. ప్రతి సర్కిల్‌ అభిమాన సంద్రమైంది. తమ అభిమాన నేతను చూసిన ఆనందం.. ఏడాదిగా తాము పడుతున్న కష్టాలు, కన్నీళ్లు గుర్తుకు వచ్చిన భావోద్వేగం.. ఏకమై దిక్కులు పిక్కటిల్లేలా.. కూటమి కుర్చీలు కదిలేలా.. జగన్నినాదమై వినిపించింది.
అన్నిదారులూ రెంటపాళ్లకే..

సత్తెనపల్లి: కూటమి నేతల దాడులు.. పోలీసుల వేధింపులు కారణంగా మనస్తాపం చెంది మృతి చెందిన కుటుంబానికి భరోసా కల్పించేందుకు తమ అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమ మధ్యకు వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు తండోపతండాలుగా, స్వచ్ఛందంగా రెంటపాళ్లకు కదిలివచ్చారు. రెండు రోజులుగా వైఎస్‌ జగన్‌ పర్యటనకు అనుమతులు లేవంటూ పోలీసులు ఇబ్బందులకు గురి చేయడం, మరోవైపు పర్యటనను అడ్డుకుంటామంటూ అధికార పార్టీ నేతలు బరి తెగించి ప్రకటనలు చేయడం, ఇంకోవైపు పోలీసులు ఎక్కడికక్కడ అభిమానులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అవేమీ లెక్క చేయకుండా ప్రజలు సత్తెనపల్లి చేరుకున్నారు.

షెడ్యూలు ప్రకారం ఉదయం 11 గంటలకు సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చేరుకోవలసిన జగన్‌మోహన్‌రెడ్డి అభిమాన హోరు ధాటికి సాయంత్రం 4:40 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల గ్రామ ఉపసర్పంచ్‌, వైఎస్సార్‌ సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడే పార్టీ జెండాను ఎగురవేశారు. మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అన్నా అధైర్య పడవద్దంటూ ధైర్యం నూరిపోసి అండగా ఉంటానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దాడులు, అక్రమ కేసులు, వైఎస్సార్‌ సీపీలో ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని బనాయిస్తున్న కేసులు, దాడులపై నిలదీశారు. అనంతరం సాయంత్రం 5:32 గంటలకు తిరిగి రోడ్డు మార్గాన తాడేపల్లి బయలుదేరారు.

సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వ అరాచకాలకు బలైపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సత్తెనపల్లి పట్టణం, సత్తెనపల్లిరూరల్‌లో పర్యటించగా, తమ అధినేత జగనన్నపై అభిమానంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు భారీ సంఖ్యలో కంటేపూడి, నందిగామ అడ్డరోడ్డు, రామకృష్ణాపురం, సత్తెనపల్లి టౌన్‌, పాకాల పాడు, రెంటపాళ్లకు తరలివచ్చారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌ రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా పట్టణంలో ద్విచక్ర వాహనాలతో వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ గోర ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రులు విడదల రజని, పేర్ని నాని, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, తలారి వెంకట్రావు, అన్నాబత్తుని శివకుమార్‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు గజ్జల సుధీర్‌ భార్గవ్‌ రెడ్డి, దేవినేని అవినాష్‌, అంబటి మురళి, నేతలు పూనూరి గౌతమ్‌రెడ్డి, డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌, నాయకులు చిట్టా విజయభాస్కర్‌ రెడ్డి, డాక్టర్‌ గజ్జల నాగభూషణ్‌రెడ్డి, పక్కాల సూరిబాబు, పెండెం బాబురావు, చల్లంచర్ల సాంబశివరావు, షేక్‌ నాగూర్‌ మీరాన్‌, రమావత్‌ కోటేశ్వరరావు నాయక్‌, రాయపాటి పురుషోత్తమరావు, కళ్లం విజయ భాస్కర్‌ రెడ్డి, మర్రి సుబ్బారెడ్డి, అచ్యుత శివప్రసాద్‌, షేక్‌ మౌలాలి, షేక్‌ జలీల్‌, చిలుక జైపాల్‌, పల్లె గాబ్రియల్‌, ఏకుల మనీషా, ఏకుల పెద్ద ముత్తయ్య, కొమ్మెర శివశంకర్‌, అబ్బూరి వీరాంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పర్యటన సాగిందిలా..

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి, నందిగామ అడ్డరోడ్డు, రామకృష్ణాపురం నుంచి పట్టణంలోకి రోడ్డు మార్గాన వైఎస్‌ జగన్‌ ప్రయాణించారు.

ఆటోనగర్‌లోని డాక్టర్‌ వైఎస్సార్‌ మెమోరియల్‌ గజ్జల వైద్యశాలలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ ప్రజలకు అభివాదం చేశారు.

అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌, తాలూకా సెంటర్‌, గడియార స్తంభం సెంటర్‌, ఐదులాంతర్ల సెంటర్‌ మీదుగా అచ్చంపేట రోడ్‌ లోని రైల్వే గేట్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ని ముందుకు వెళ్లనిచ్చి వెంట ఉన్న నాయకుల వాహనాలు, ద్విచక్ర వాహనాలను పోలీసులు అనుమతించకపోవడంతో పార్టీ నేతలు ‘డౌన్‌ డౌన్‌ పోలీసులు’ అంటూ నినదించారు.

అక్కడి నుంచి అంబేడ్కర్‌ నగర్‌, గండ్లురు అడ్డరోడ్డు, పాకాల పాడు మీదుగా రెంటపాళ్లకు చేరుకున్నారు. అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా భారీ పొక్లెయిన్లతో గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికి వారు జై జగన్‌ .. జై జై జగన్‌ అంటూ నినదించారు. పెద్ద ఎత్తున ప్రజలు ఘనస్వాగతం పలకడంతో వైఎస్‌ జగన్‌ చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.

కదం తొక్కిన నేతలు, కార్యకర్తలు1
1/1

కదం తొక్కిన నేతలు, కార్యకర్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement