
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ‘తల్లికి వందనం’
తెనాలి టౌన్: విద్యావ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలిలోని జనసేన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.67లక్షల మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం తాలూకు నగదు జమ అవుతున్నట్లు స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 24,65,000 మందికి అదనంగా సాయం అందుతున్నట్లు వెల్లడించారు. తెనాలి నియోజకవర్గంలో 22,383 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు తెలిపారు. పట్టణంలో 12,157 మంది, తెనాలి మండలంలో 6,748, కొల్లిపర మండలం 4,409 లబ్ధిదారులు ఉండగా మొత్తం రూ.32,07,45,000 జమ అయినట్లు చెప్పారు.