
గజాననా రక్షమాం..
మామిడికుదురు: వినాయక చవితి వచ్చేస్తోంది.. పర్యావరణ పరిరక్షణ హితం కోరుతూ పీచుతో వినాయకుడి బొమ్మలను పాశర్లపూడిబాడవకు చెందిన మహిళలు తయారు చేస్తున్నారు. ఈ బొమ్మలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒకటిన్నర అడుగులు నుంచి రెండడుగుల సైజులో ఉన్న ఈ బొమ్మలు అబ్బుర పరుస్తున్నాయి. పీచుతో తయారైన ఈ బొమ్మల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉందని ఆక్సిజన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు కటికిరెడ్డి గంగాధర్ తెలిపారు. పీచుతో తయారు చేస్తున్న ఈ బొమ్మలను ప్రతి ఒక్కరూ ఆదరించి మహిళలను ప్రోత్సహించాలని అన్నారు.