వేలివెన్ను శశి ర్యాంకర్లకు సత్కారం | - | Sakshi
Sakshi News home page

వేలివెన్ను శశి ర్యాంకర్లకు సత్కారం

Jun 16 2025 5:45 AM | Updated on Jun 16 2025 5:45 AM

వేలివెన్ను శశి ర్యాంకర్లకు సత్కారం

వేలివెన్ను శశి ర్యాంకర్లకు సత్కారం

విజేతలకు అభినందన సభలో మాట్లాడుతున్న శశి విద్యా సంస్థల చైర్మన్‌ రవికుమార్‌

ఉండ్రాజవరం: నీట్‌–2025 ఫలితాల్లో జాతీయస్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించిన శశి వేలివెన్ను విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం వేలివెన్ను క్యాంపస్‌లో సత్కరించారు. ఈ క్యాంపస్‌కు చెందిన కె.భాను ప్రకాష్‌ జాతీయస్థాయి 25వ ర్యాంకు, కె.మోహిత్‌ శ్రీరామ్‌ 42, ఎస్‌.గోవర్ధన్‌ 50, వై.చరణ్‌ 60, డి.రత్నకుమార్‌ 111, టి.శ్రీరామ్‌ 204, ఎం.ఆస్మిత 231, జి.ఆకాష్‌ వీరా 239, డి.శ్యామ్‌ కృష్ణారెడ్డి 278, జి.కార్తికేయ 331, ఎ.సత్య 472 ర్యాంకు సాధించగా వారిని సత్కరించి అభినందించారు. రవికుమార్‌ మాట్లాడుతూ ఆలిండియా ర్యాంకులు 100 లోపు నలుగురు, 500 లోపు 11 మంది, వెయ్యి లోపు 16, ఐదు వేల లోపు 41 మంది, పది వేల లోపు 84 మంది సాధించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement