నీట్‌లో ఆదిత్య పభంజనం | - | Sakshi
Sakshi News home page

నీట్‌లో ఆదిత్య పభంజనం

Jun 15 2025 8:09 AM | Updated on Jun 15 2025 8:09 AM

నీట్‌

నీట్‌లో ఆదిత్య పభంజనం

బాలాజీచెరువు (కాకినాడ): నీట్‌–2025 ఫలితాల్లో 625/720 మార్కులతో వి.సాయి భవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకును సాధించారని ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ ఏకేన దీపక్‌రెడ్డి తెలిపారు. ఎన్‌టీఏ ప్రకటించిన నీట్‌ ఫలితాల్లో దగ్గుమాటి శ్రవణ్‌ కార్తికేయ ఆలిండియా 109వ ర్యాంకు, వీరంరెడ్డి సాయిభవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకు, దంగేటి శ్రీనివాస రిషిత్‌ ఆలిండియా 890వ ర్యాంకులను సాధించారని అన్నారు. ఆలిండియా నీట్‌ ఫలితాల్లో 550 మార్కులు పైన 12 మంది విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడంతో ఆంధ్రప్రదేశ్‌ విద్యా రంగంలో శ్రీఆదిత్యశ్రీను అగ్రగామిగా నిలిచిందని ఆ విద్యాసంస్థల చైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విజేతలను ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ దీపక్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌కు అడ్మిషన్లు విశాఖపట్నం ఆదిత్య గంగరాజునగర్‌, మారికవలసలో ప్రారంభించారని తెలిపారు. ఆదిత్య విద్యాసంస్థల హాస్టల్‌ డైరెక్టర్‌ ఎ.లక్ష్మీరాజ్యం, డైరెక్టర్‌ శృతి, డైరెక్టర్‌ సుగుణ, ప్రిన్సిపాల్స్‌ జె.మొయిన, పి.సత్యనారాయణ రెడ్డి, కోఆర్డినేటర్‌ కె.లక్ష్మీకుమార్‌, అకడమిక్‌ డైరెక్టర్‌ ఎస్‌వీ రాఘవరెడ్డి, ఎస్‌పీ గంగిరెడ్డి, ఐఐటీ క్యాంపస్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎం.ఫణీంద్ర, ఆదిత్య నిర్వహణలో గల ఇతర కేంద్రాల్లో ప్రిన్సిపాల్స్‌ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, ఉత్తమ శిక్షణ అందించిన అధ్యాపకవర్గాన్ని అభినందించారు.

నీట్‌లో ఆదిత్య పభంజనం1
1/2

నీట్‌లో ఆదిత్య పభంజనం

నీట్‌లో ఆదిత్య పభంజనం2
2/2

నీట్‌లో ఆదిత్య పభంజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement