
శ్రీషిర్డీసాయి విజయకేతనం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): నీట్ ఫలితాల్లో శ్రీషిర్డీ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య తెలిపారు. తమ దీకా్ష్య్ మెడికల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బి.సంజన ఆల్ ఇండియా 227వ ర్యాంకు, కె.పావన్ తనయ్ 308వ ర్యాంకును కై వసం చేసుకున్నారన్నారు. 2 వేల లోపు ర్యాంకులు ఐదుగురు, ఐదు వేల లోపు 8 మంది, పది వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. విద్యా సంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ హాజరైన మొత్తం విద్యార్థుల్లో 20 శాతం మంది ఎమ్బీబీఎస్ సీట్లు సాధించగలరన్నారు. ఏటా తమ విద్యార్థులు నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. విజేతలైన విద్యార్థులను, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, దీక్ష్యా అకాడమీ డీన్ పి.నరసింహారావు అభినందించారు.

శ్రీషిర్డీసాయి విజయకేతనం