తండ్రి మందలించాడని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తండ్రి మందలించాడని ఆత్మహత్య

Jun 14 2025 7:31 AM | Updated on Jun 14 2025 7:31 AM

తండ్రి మందలించాడని ఆత్మహత్య

తండ్రి మందలించాడని ఆత్మహత్య

కొత్తపేట: తండ్రి మందలించాడని మనస్తాపంతో ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై జీ సురేంద్ర శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని పలివెలశేరేపాలెం గ్రామానికి చెందిన తులా రాంబాబు కుమారుడైన సతీష్‌ (31) గురువారం పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. భోజనం చేస్తున్న సమయంలో పనికి వెళ్లగా వచ్చిన డబ్బు ఇంట్లో ఇవ్వకుండా రోజూ మద్యం తాగుతున్నావని తండ్రి రాంబాబు మందలించాడు. దాంతో మనస్తాపం చెందిన సతీష్‌ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కొంతసేపటి తరువాత గదిలోంచి శబ్దం రావడంతో తండ్రి రాంబాబు కిటికీలోంచి చూడగా మంచంపైన ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని వేళ్లాడుతున్నాడు. స్థానికుల సాయంతో తలుపుతీసి సతీష్‌ను కిందికి దించి చూడగా స్పృహలో లేకపోవడంతో వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వై ద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. కాగా సతీష్‌కు వివాహం కాలేదు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement