
సముద్రంలో గల్లంతైన బాలుడి మృతి
కాకినాడ రూరల్: కాకినాడ – ఉప్పాడ బీచ్ రోడ్డులో రూరల్ మండల పరిధిలో నేమాం రాళ్ల బీచ్ వద్ద గురువారం సాయంత్రం స్థానం కోసం దిగి గల్లంతైన జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బాలుడు సముద్రాల పార్దు(17) మృతి చెందాడు. తిమ్మాపురం పోలీసుల వివరాలు ప్రకారం పార్ధు, అతని స్నేహితులు నిడదవోలుకు చెందిన నారపురెడ్డి దుర్గాప్రసాద్, జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరం మండలానికి చెందిన కేతామోహన్ కలిసి బైక్పై గురువారం సాయంత్రం కాకినాడ బీచ్కు వచ్చారు. స్టోన్ బీచ్ వద్ద సాయంత్రం 4.30గంటల సమయంలో పార్ధు, దుర్గా ప్రసాద్ స్నానం చేస్తుండగా మోహన్ ఫొటోలు తీశాడు. ఆ సమయంలో పార్థు బలమైన అలలకు కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం ఉదయం 11గంటలకు ఘటన స్థలం సమీపంలోనే బాలుడి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గణేష్కుమార్ తెలిపారు.