పుష్కర్‌ఘాట్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం | - | Sakshi
Sakshi News home page

పుష్కర్‌ఘాట్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

Jun 13 2025 5:23 AM | Updated on Jun 13 2025 1:14 PM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక పుష్కర్‌ఘాట్‌ వద్దనున్న గోదావరి నదిలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు వయసుగల వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. 5.5 అడుగుల ఎత్తు ఉండగా మృతదేహంపై నీలం రంగు షర్ట్‌ ఉంది. ఎడమపాదానికి నలుపురంగు కాశీతాడు ఉంది. కుడిచేయి మణికట్టుకు నలుపురంగు పూసలతాడు, కుడిచేయి మణికట్టు వద్ద కాషాయ రంగు తాడు కట్టి ఉంది. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసిన వారు మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ 9989786529, 9440796532 నంబర్లలో తెలపాలన్నారు.

గుర్తు తెలియని మృతదేహం స్వాధీనం

తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ విశ్వం తెలిపిన వివరాల ప్రకారం కొవ్వూరు లాంచీల రేవు వద్ద గోదావరిలో 40 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఆర్‌డీని కలిసిన ఏపీ ఎన్‌జీవో నేతలు
ఆఫీస్‌ బేరర్‌ అయినప్పటి నుంచే లెక్కించాలని వినతి

కాకినాడ క్రైం: ఆఫీస్‌ బేరర్లకు ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిదేళ్ల మినహాయింపును ఆఫీస్‌ బేరర్‌గా చేరినప్పటి నుంచి మాత్రమే లెక్కించాలని కోరుతూ జోన్‌–2 ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ నాయకులు గురువారం సాయంత్రం రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మాశశిధర్‌ను రాజమహేంద్రవరంలోని ఆర్‌డీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. స్టేషన్‌ సీనియారిటీ పరిగణించరనే విషయాన్ని ప్రభుత్వం జీఏడీ సర్కులర్‌ ద్వారా తెలియజేసిందని పేర్కొన్నారు. సదరు పత్రాలను ఆర్‌డీకి అందజేశారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టడంతో పాటు మినహాయింపులను పరిగణించాలని కోరారు. 

ఏపీ ఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు గుద్దటి రామ్మోహన్‌ అధ్యక్షతన రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాస్‌, చోడిశెట్టి శ్రీనివాస్‌, కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, కృష్ణాజిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి నేరుసు రామారావు, ఉమ్మడి తూర్పుగోదావరి సహ అధ్యక్షుడు మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పాలపర్తి మూర్తిబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మినీస్టిరియల్‌ సంఘ అధ్యక్షుడు వీరాజీ, రాజమహేంద్రవరం యూనిట్‌ సహ అధ్యక్షుడు అనిల్‌తో పాటు వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement