ఏదీ.. వ్యవసాయం! | - | Sakshi
Sakshi News home page

ఏదీ.. వ్యవసాయం!

Jun 10 2025 6:57 AM | Updated on Jun 10 2025 6:57 AM

ఏదీ..

ఏదీ.. వ్యవసాయం!

నాడు రైతులకు పెద్ద పీట

● గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. మిచాంగ్‌ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన కర్షకుల కన్నీళ్లు తుడిచింది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటల లెక్క వేగంగా తేల్చింది. నెలల వ్యవధిలోనే పంటలకు పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) అందించింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 15,615 మంది రైతులకు సంబంధించి 10,487.02 హెక్టార్లలో ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బ తిన్నట్లు నాడు వ్యవసాయ అధికారులు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ప్రభుత్వం ఇంకో ఆలోచన చేయకుండా రైతులకు అండగా నిలిచింది. నష్టపోయిన రైతులకు రూ.14.80 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేసింది.

● వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం కింద గత ప్రభుత్వం రైతులకు అత్యాధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 367 ఆర్‌బీకేలు ఉండగా.. తొలి దశలో ప్రతి మండలంలో మూడు చొప్పున ఆర్‌బీకేలకు డ్రోన్లు మంజూరు చేసింది. జిల్లాకు మొత్తం 91 డ్రోన్లు అందుబాటులోకి తెచ్చి, వ్యవసాయ పనులకు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంది.

● ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించింది. ఆర్‌బీకేల ద్వారా వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాలు, తూనికలు – కొలతలు, ఇతర శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోలు చేపట్టింది. రవాణా చార్జీల చెల్లింపులో జాగ్రత్తలు తీసుకున్నారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేశారు.

కూటమి పాలనలో

వ్యవసాయ రంగం తిరోగమనం

రబీ ధాన్యం సొమ్ము చెల్లింపులో నిర్లక్ష్యం

అందని ‘అన్నదాత సుఖీభవ’

గత ప్రభుత్వంలో సాగుకు భరోసా

అడగడుగునా రైతుకు తోడ్పాటు

క్రమం తప్పకుండా రైతు భరోసా

పంట నష్టపోయిన

మూడు నెలల్లో పరిహారం

సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగం తిరోగమనంలో పయనిస్తోంది. సాగుకు సిద్ధమైన సమయంలో పెట్టుబడులకు ‘అన్నదాత సుఖీభవ’ ఆర్థిక సాయం అందడం లేదు. పంట నష్టపోతే పరిహారం సైతం అందే పరిస్థితి లేదు. బీమా ప్రీమియం చెల్లింపునకు మంగళం పాడారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు పంట విక్రయాల వరకూ రైతులకు అడుగడుగునా అండగా నిలిచిన రైతుభరోసా కేంద్రాలను (ఆర్‌బీకే) నిర్వీర్యం చేశారు. ఆరుగాలం స్వేదం చిందించి, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయిస్తే.. సకాలంలో సొమ్ము ఇవ్వకుండా రైతులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. పొగాకుకు మద్దతు ధర లేదు. ఉద్యాన, ఆక్వా పంటలకు సైతం ప్రోత్సాహం కరువైంది. వెరసి అన్నదాతకు ఆర్తనాదాలు తప్పడం లేదు.

గతమెంతో ఘనం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. రైతులను ఆదుకునేందుకు, పెట్టుబడులకు అప్పులు చేయకుండా ఉండేందుకు ‘రైతు భరోసా’ పేరిట ఏటా రూ.13,500 ఆర్థిక సాయం అందించారు. ఈవిధంగా నాలుగేళ్లలో 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్లు అందజేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో అండగా నిలిచారు. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందుబాటులోకి తెచ్చారు. ఆక్వా రైతులకు విద్యుత్‌లో రాయితీ సైతం అమలు చేశారు. వెరసి వ్యవసాయ రంగం సస్యశ్యామలంగా విరాజిల్లింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20,000 అందిస్తామని గొప్పగా ప్రకటించి, తొలి ఏడాది ఎగ్గొట్టారు. దీనిని ఈ ఏడాదైనా అమలు చేస్తారా అనే మీమాంస నెలకొంది. ఈ పథకం కోసం 1.35 లక్షల మంది రైతులు నిరీక్షిస్తున్నారు.

వ్యవసాయ విద్యుత్‌కు కోతలు

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు నాంది పడింది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్‌ సరఫరా ఇస్తున్నామని ప్రకటనలు గుప్పించిన సర్కారు.. కొన్ని రోజులకే దీనిని 8 గంటలకు తగ్గించింది. తరువాత మరో గంట కుదించింది. విద్యుత్‌ అధికారుల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా.. ఎలాంటి ప్రకటనా చేయకుండా అనధికారిక కోతలు అమలు చేస్తోంది. తద్వారా వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే విద్యుత్‌ ఇస్తామన్న సంకేతాన్ని రైతులకు ఇస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేలకు పైగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్ట ప్రాంతాలైన దేవరపల్లి, గోపాలపురం, చాగల్లు, నల్లజర్లలో కొంత భాగం, నిడదవోలు రూరల్‌, పెరవలి మండలంలో కొన్ని గ్రామాలు, గోకవరం, రాజానగరం, అనపర్తి మండలాల్లో ఎక్కువ శాతం రైతులు ఉద్యాన పంటలకు బోర్లపై ఆధారపడుతారు. వీరందరికీ ఇబ్బందులు తప్పడం లేదు.

ధాన్యం.. దయనీయం..

ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం నెల రోజులు గడుస్తున్నా ఆ డబ్బులు ఇవ్వడం లేదు. గత నెల 24వ తేదీ నాటికి 3.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. దీనికి గాను రూ.781.08 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ.632.6 కోట్లు ఇచ్చారు. మిగిలిన రూ.148.48 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో తెలియకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉచిత పంటల బీమా హుళక్కి

ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు దెబ్బ తిన్న రైతులకు ఎటువంటి నష్టమూ వాటిల్లకుండా పరిహారం అందించడంలో ఉచిత పంటల బీమా కీలక భూమిక పోషించేది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం సొమ్ము రైతులే చెల్లించాలని నిబంధన పెట్టింది. 2024–25 రబీ సీజన్‌లో ప్రభుత్వం గుర్తించిన పంటలకు బీమా ప్రీమియం చెల్లింపునకు ఉత్తర్వులు వెలువరించింది. వరికి హెక్టారుకు రూ.1.05 లక్షలుగా విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,575 ప్రీమియం చెల్లించాల్సి ఉంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు వాటాను సైతం ప్రభుత్వమే భరించేది.

పంటల వారీగా హెక్టారుకు మంజూరు చేసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ

పంట ఇన్‌పుట్‌ సబ్సిడీ

వరి, వేరుశనగ, పత్తి, చెరకు రూ.17,000

మొక్కజొన్న రూ.12,500

మినుములు, పెసలు, శనగలు, రూ.10,000

పొద్దుతిరుగుడు, పొగాకు

జొన్న 8,500

జిల్లాలో ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు ఇలా..

నియోజకవర్గం రైతులు పంట నష్టం ఇన్‌పుట్‌ సబ్సిడీ

(హెక్టార్లలో) (రూ.లక్షల్లో)

అనపర్తి 682 344.28 52.43235

రాజమండ్రి రూరల్‌ 214 112.55 18.8077

రాజానగరం 8,554 6032.16 838.6905

జగ్గంపేట (గోకవరం) 1,484 832.05 141.4485

గోపాలపురం 2,970 2195.81 279.91535

కొవ్వూరు 819 534.9 77.28165

నిడదవోలు 892 435.27 71.9426

ఏదీ.. వ్యవసాయం!1
1/2

ఏదీ.. వ్యవసాయం!

ఏదీ.. వ్యవసాయం!2
2/2

ఏదీ.. వ్యవసాయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement