యోగాపై అవగాహన ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

యోగాపై అవగాహన ర్యాలీ

Jun 10 2025 6:57 AM | Updated on Jun 10 2025 6:57 AM

యోగాప

యోగాపై అవగాహన ర్యాలీ

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా రాజమహేంద్రవరం వై జంక్షన్‌ నుంచి దేవీచౌక్‌ వరకూ, తిరిగి వై జంక్షన్‌ వరకూ సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న యోగాంధ్ర జిల్లా నోడల్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చిన్నరాముడు మాట్లాడుతూ, సుమారు 2,100 మందితో ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు రేపు బస్‌ పాస్‌లు

రాజమహేంద్రవరం సిటీ: ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ జిల్లాలోని రాజమహేంద్రవరం, కొవ్వూరు, గోకవరం, నిడదవోలు ఆర్టీసీ డిపోల్లో బుధవారం ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ విద్యార్థులకు బస్‌ పాస్‌లు ఇవ్వనున్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి వై.సత్యనారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.

పీజీఆర్‌ఎస్‌కు 159 అర్జీలు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించి జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ప్రజలు 159 అర్జీలు సమర్పించారు. వారి నుంచి డీఆర్‌ఓ సీతారామమూర్తి, డీఎల్‌డీఓలు పి.వీణాదేవి తదితరులు అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డీఆర్‌ఓ ఈ సందర్భంగా చెప్పారు.

యోగాపై అవగాహన ర్యాలీ 1
1/1

యోగాపై అవగాహన ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement