రత్నగిరిలో భక్తజన సంద్రం | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిలో భక్తజన సంద్రం

Jun 8 2025 12:14 AM | Updated on Jun 8 2025 12:14 AM

రత్నగిరిలో భక్తజన సంద్రం

రత్నగిరిలో భక్తజన సంద్రం

సత్యదేవుని దర్శించిన 50 వేల మంది

2,300 వ్రతాల నిర్వహణ

దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం

అన్నవరం: రత్నగిరి శనివారం భక్తజన సంద్రాన్ని తలపించింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు వేలాదిగా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. రద్దీ అధికంగా ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని కొంతసేపు నిలిపివేశారు. సుమారు 50 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2,300 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement