అక్రమంగా గోవుల తరలింపు | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా గోవుల తరలింపు

Jun 7 2025 12:11 AM | Updated on Jun 7 2025 2:17 PM

48 మూగజీవాల స్వాధీనం

పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు

వాహనం సీజ్‌

తాళ్లపూడి: ఐషర్‌ లారీలో అక్రమంగా తరలిస్న్ను ఆవులు, దూడలు, ఎద్దులను కొవ్వూరు సీఐ పి.విశ్వం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కొవ్వూరు పట్టణంలోని గ్రామన్‌ బ్రిడ్జి వద్ద రోడ్డు బొబ్బిలి నుంచి తుని మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి అందులని 16 ఆవులు, 18 దూడలు, నాలుగు ఎద్దులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్‌ చేశారు. అనుమతి లేకుండా గోవులను తరలిస్తే చర్యలు తప్పవని విశ్వం తెలిపారు. దీనిపై తాండ్ర నరేష్‌, పాసాదులు దుర్గాప్రసాద్‌లపై కేసు నమోదు చేయడం జరిగిందని సిఐ తెలిపారు.

వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

ధవళేశ్వరం: స్థానిక జాతీయ రహదారిపై మంతెన సత్యనారాయణరాజు ఆశ్రయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఉదయం జాతీయ రహదారిపై సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతనిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతిచెందాడు. మృతుని ఆచూకీ తెలిసినవారు 94407 96586, 94919 99336 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ టి.గణేష్‌ కోరారు.

 

అక్రమంగా గోవుల తరలింపు 1
1/1

అక్రమంగా గోవుల తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement