
కారుపై కూలిన కొబ్బరి చెట్టు
సఖినేటిపల్లి: సఖినేటిపల్లిలంక గ్రామంలోని ప్రధాన రహదారిలో బుధవారం ఓ కారుపై కొబ్బరి చెట్టు కూలింది. ప్రయాణికులతో వెళుతున్న ఈ కారు ముందు భాగంపై చెట్టు కూలినప్పటికీ, అందులో ఉన్నవారు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కారు రామాలయం వద్దకు చేరుకునేసరికి అకస్మాత్తుగా రోడ్డు పక్కనున్న కొబ్బరి ముచ్చెట్టు(శిథిల చెట్టు) విరిగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్
నిడదవోలు రూరల్: సెల్ఫోన్లోని యాప్తో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు బుధవారం తెలిపారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలోని లోహియనగర్కు చెందిన మన్యం శివ మంగళవారం రాత్రి ఐపీఎల్ ఫైనల్లో భాగంగా ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తుండగా అరెస్ట్ చేసినట్టు చెప్పారు. బెట్టింగ్కు వినియోగిస్తున్న సెల్ఫోన్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం
కడియం: ద్వారపూడి–కడియం స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ వద్ద బుధవారం సుమారు 35 ఏళ్ల గుర్తు తెలియని పురుష మృతదేహం లభ్యమైందని ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. లేత ఆకుపచ్చ రంగు ప్యాంట్ మాత్రమే ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్టు చెప్పారు. ఇతడి వివరాలు తెలిస్తే 94406 27551 నంబర్లో తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.